Sunday, January 2, 2011

ఎమ్మెల్యేగా పోటీ చేయను, త్వరలో తెలంగాణలో ఓదార్పు: వైఎస్ జగన్

YS Jagan
హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో పులివెందుల శాసనసభ్యుడిగా పోటీ చేయనని మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ప్రభుత్వాన్ని కూలదోస్తాడు అనే అపవాదు తనకు వస్తుందని, అందుకే కడప నుండి పార్లమెంటు సభ్యుడిగానే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. కాగా ఆయన పులివెందుల సమావేశాలలో కూడా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితీ 1994 కంటే దారుణంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మూడో స్థానానికి కూడా దిగజారవచ్చునన్నారు. ఆ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం లేదన్నారు. తెలంగాణలో త్వరలో ఓదార్పు యాత్రను చేపడతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణం తట్టుకోలేక పలువురు మృతి చెందారని వారిని ఓదార్చడానికి త్వరలో తెలంగాణలో యాత్ర చేపడతానని చెప్పారు.

No comments: